అనసూయ 'జబర్దస్త్'ని వీడటానికి కారణం ఇదేనా?
on Jul 1, 2022
కామెడీ షోలు ఎన్ని వచ్చినా జబర్దస్త్ కున్న క్రేజే వేరు.. కానీ ఇప్పడు ఈ షోలు కూడా కళ తప్పుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత కొన్నేళ్లుగా హాస్య ప్రియుల్ని నవ్విస్తున్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షో లు క్రమ క్రమంగా తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. కారణం ఈ షోలలో తమదైన కామెడీతో ఆకట్టుకుంటూ వస్తున్న కమెడియన్ లు మూకుమ్మడిగా షోని వీడిపోవడమే అని తెలుస్తోంది. ఇక తాజాగా ఈ షోకు యాంకర్ అనసూయ కూడా భారీ షాకిచ్చింది.
గత కొన్నేళ్లుగా సినిమాల్లో నటిస్తూనే జబర్దస్త్ షో కు యాంకర్ గా వ్యవహరిస్తూ వస్తోంది. కానీ ఇటీవల బలమైన నిర్ణయం తీసుకున్నానని ఇండైరెక్ట్ గా వెల్లడించి ఈ షో నుంచి తప్పుకుంది. నాగబాబు నుంచి మొదలైన ఈ పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. రీసెంట్ గా సుడిగాలి సుధీర్ జబర్దస్త్ తో పాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`ని కూడా విడటంతో ఈ షోలకు క్రేజ్ తగ్గడం మొదలైంది. తాజాగా అనసూయ కూడా గుడ్ బై చెప్పడంతో ఆమె తరువాత ఇంకా ఎంత మంది ఈ షోని వీడతారో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇదిలా వుంటే అనసూయ ఈ షోని వీడటానికి కారణం ఇదే అంటూ నెట్టింట ఓ వార్త వైరల్ గా వినిపిస్తోంది. ఒకప్పుడు టాప్ రేటింగ్ లో వున్న ఈ షోకు పాపులారిటీ తగ్గడం.. రేటింగ్ దారుణంగా పడిపోవడం.. అంతే కాకుండా ఇదే సమయంలో అనసూయ వరుస సినిమాలు, టీవీ షోల్లో బిజీగా మారడంతో ఈ షోని వీడినట్టుగా చెబుతున్నారు. స్టార్ మాలో సుధీర్ తో కలిసి `సూపర్ సింగర్` కి యాంకర్ గా వ్యవహరిస్తోంది అనసూయ. అంతే కాకుండా ఇదే ఛానల్ లో మరో కార్యక్రమానికి కూడా సుధీర్ తో కలిసి యాంకర్ గా వ్యవహరిస్తున్న కారణంగానే అనసూయ జబర్దస్త్ ని వీడినట్టుగా చెబుతున్నారు.